News July 5, 2025

నిర్మల్ రూరల్: ‘విద్యార్థుల సంఖ్య ఉన్నా పాఠశాల లేదు’

image

విద్యా శాఖ నియమ నిబంధనల ప్రకారం జనావాసాలకు కిలోమీటర్ పరిధిలో 20 మంది బడి ఈడు పిల్లలుంటే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. కానీ నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల వద్ద సుమారు 70మంది బడి ఈడు పిల్లలు ఉన్నారు. గతేడాది బడి ఏర్పాటు చేయాలని వినతులు కూడా సమర్పించారు. రాష్ట్రంలో 63, జిల్లాలో2 కొత్త పాఠశాలలు మంజూరు చేసినా ప్రభుత్వం ఇక్కడ పాఠశాల మంజూరు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Similar News

News July 5, 2025

తల్లిదండ్రులకు పోలీసుల సూచన!

image

పిల్లలు ఇంటి నుంచి తరగతి గదికి చేరే వరకూ సురక్షితంగా వెళ్తున్నారా? లేదా? అనేది చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు & బస్సు డ్రైవర్లపై ఉందని పోలీసులు తెలిపారు. ‘స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? నైపుణ్యం కలిగిన డ్రైవరేనా? పికప్, డ్రాప్ టైమ్‌ను పాటిస్తున్నారా? లేదో గమనించాలి. స్కూల్ యాజమాన్యాలు బస్సుల్లో ఎమర్జెన్సీ నంబర్లను రాసి ఉంచాలి’ అని ట్వీట్ చేశారు.

News July 5, 2025

పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

image

పెందుర్తిలో వ్యభిచార గృహంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. భార్యాభర్తలమంటూ బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ సుజాతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం రావడంతో సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. వారిద్దరితో పాటు ఓ విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డుతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఐ సూచించారు.

News July 5, 2025

గిల్ మరో సెంచరీ

image

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.