News September 22, 2025

నిర్మల్: రేపటి ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 22, సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణిని తిరిగి నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలు ఉన్నవారు నేరుగా సంబంధిత శాఖాధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.

Similar News

News September 22, 2025

సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం

News September 22, 2025

వరంగల్: భారీ క్యూ లైన్.. ఎందుకో తెలుసా..?

image

WGL జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పై ఫొటోలో కనిపిస్తున్న భారీ క్యూ లైన్ ఎందుకో గెస్ చేయండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూరియా క్యూలైన్లు మనకు కనిపిస్తున్నాయి. అలా, ఇది కూడా యూరియా కోసమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం మన సాంప్రదాయం. దీనిలో భాగంగా రాయపర్తి అర్చకుడు ఆరుట్ల రామకృష్ణ చార్యులు ఇంటి ముందు తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చేందుకు ఇలా క్యూ కట్టారు.

News September 22, 2025

మహిళలతో కిక్కిరిసిన వేయి స్తంభాల గుడి

image

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించి పేర్చిన బతుకమ్మలతో మహిళలందరూ భారీగా వేయి స్తంభాల గుడికి చేరుకొని సందడి చేశారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి డీజే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండగ శోభను మరింత పెంచారు. మహిళలతో గుడి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.