News March 14, 2025
నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.
Similar News
News February 11, 2026
అనుదీప్ మళ్లీ అలరించేనా?

కామెడీ సినిమాల్లో ‘జాతిరత్నాలు’ ట్రెండ్ సెట్ చేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ అనుదీప్ నుంచి ఆ స్థాయి సినిమా రాలేదు. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ‘ఫంకీ’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ మూవీతో అభిమానులను అలరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని చెబుతున్న ఈ డైరెక్టర్ ఫంకీతో అలరిస్తారో లేదో చూడాలి.
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్లో 162 మంది, ఆర్మూర్లో 153 మంది, భీంగల్లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
News February 11, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాను కోరిన CM

ఢిల్లీ పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్కు విజ్ఞప్తి చేశారు.


