News May 7, 2025

నిర్మల్: ‘లబ్ధిదారుల గుర్తింపు వేగవంతం చేయాలి’

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన లబ్ధిదారుల గుర్తింపు వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల జాబితాలో అర్హులను గుర్తించాలన్నారు.

Similar News

News April 5, 2026

జిల్లలో తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు: ఎస్‌ఈ

image

కర్నూల్ జిల్లా గోకులపాడులో పీఎం సూర్య ఘర్ ఉత్సవ్‌ను విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్లాలో 23,077 గృహాలకు మంజూరు కాగా, తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

News April 5, 2026

GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

image

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.

News April 5, 2026

సిరిసిల్ల : ఘనంగా ఈస్టర్ డే వేడుకలు

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో ఈస్టర్‌డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తును శిలువ వేసిన మూడో రోజు క్రీస్తు(పునరుథ్థానం) తిరిగి వచ్చిన సందర్భంగా వేడుకలను ప్రత్యేక ప్రార్థనల మధ్య జరిపారు. పలువురు నిరుపేదలకు నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు.