News April 16, 2024

నిర్మల్: విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి నివేదిక అందజేయాలి: కలెక్టర్

image

విద్యార్థి ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.

Similar News

News September 10, 2025

ఇంద్రవెళ్లి : రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

image

ఇంద్రవెళ్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ధన్నుర బి వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఒక బైక్‌పై గుడిహత్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బైక్‌పై ఉట్నూర్ మండలం ఉమ్రి తాండ్రకు చెందిన ఒక కుటుంబం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

ఆదిలాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఎండోన్‌మెంట్ భూములు, భూ భారతిలో నమోదైన సాదాబైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులపై గూగుల్ మీట్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ మండలాల్లో పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులు, భూపరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూ భారతి అప్లికేషన్‌లో నమోదవుతున్న సాదా బైనామాలు, వాటి పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News September 9, 2025

ఉట్నూర్: ‘ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

image

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.