News March 1, 2025

నిర్మల్: వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

image

నూతన ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. శుక్రవారం 2024 ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ తరగతులను పంచ సీల్ కళాశాలలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ తమ సర్వీసులో విద్యార్థులకు ఏ విధంగా క్రమశిక్షణతో వెలిగి పురోగతి సాధించాలో శిక్షణ అందించారు. ఎంఈఓ నర్సయ్య, విజయ్ కుమార్, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

58 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్‌ను బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 9.
వెబ్‌సైట్: <>https://bankofbaroda.bank.in/<<>>
#ShareIt

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.

News September 19, 2025

మహబూబాబాద్: ఐదుగురి కోసం 9 మంది..!

image

నెల్లికుదురు(M) రాజులకొత్తపల్లి జడ్పీ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తుండటం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 9, 10వ తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. పాఠశాల తెరిచి 3 నెలలు గడిచినా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.