News January 30, 2025
నిర్మల్: ‘వేసవిలో బోరు బావులు వేయవద్దు’

నిర్మల్ జిల్లాలో అధికంగా బోరుబావులు వాడటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, వేసవిలో బోరుబావులు వేయవద్దని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 12% అధికంగా ఉన్నందున వ్యవసాయం కోసం ఎక్కువ భూగర్భ జలాలు వాడుతున్నారని తెలిపారు. జిల్లాలో 45 వేలకు పైగా బోరుబావులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.
News February 28, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 28)

1927: భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం
1928: విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం
1948: రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం
1963: భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)
* నేషనల్ సైన్స్ డే
* వరల్డ్ టైలర్స్ డే
News February 28, 2026
ఏన్కూర్లో ఎంపీపీఎస్ హెచ్ఎమ్ సస్పెండ్

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.


