News November 6, 2025
నిర్మల్: సన్న బియ్యం గుర్తించేందుకు నూతన పరికరం

సన్న బియ్యానికి ప్రభుత్వం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వాటిని గుర్తించేందకు అధికారులు కొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. సన్నాలను గుర్తించేందుకు గ్రేన్ కాలిపర్ పరికరాన్ని వాడనున్నారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు వంటి ప్రమాణాలను దాని ద్వారా కొలిచి సన్న, దొడ్డు రకాలను తేల్చవచ్చు. పొట్టు తీసిన బియ్యం గింజను పరికరంతో కొలిచి వచ్చిన శాతం ఆధారంగా సన్నాలను గుర్తిస్తారు.
Similar News
News November 6, 2025
బీస్ట్ మోడ్లోకి ఎన్టీఆర్.. లుక్పై నీల్ ఫోకస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
News November 6, 2025
గద్వాల్: నేడు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
News November 6, 2025
మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.


