News February 19, 2026

నిర్మల్: సర్కారు బడుల్లో 21న పీటీఎం

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి 21న తల్లిదండ్రుల సమావేశాలు (PTM) నిర్వహించాలని డీఈఓ భోజన్న గురువారం ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు భాష, గణిత అంశాల్లో ఇంటి వద్ద ఎలా సహాయం చేయాలో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను అధిక సంఖ్యలో ఆహ్వానించి, నిర్ణీత అంశాలపై చర్చించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని కోరారు.

Similar News

News February 19, 2026

నరసాపురం: బలవన్మరణానికి పాల్పడిన బాలిక

image

నరసాపురం పట్టణంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి చెప్పారు. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2026

KNR: ‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

image

జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.

News February 19, 2026

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: మంత్రి స్వామి

image

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్‌కి అర్హత సాధించినట్లు తెలిపారు.