News February 27, 2025
నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.
Similar News
News February 27, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94% నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం4 గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 91.94% ఓట్లు పోలైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2022 మంది ఓటర్లు ఉండగా 1859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
News February 27, 2025
సత్యవర్ధన్కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.
News February 27, 2025
కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.