News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News September 18, 2025
ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 18, 2025
HYD: ఒకే రోజు.. ఒక్కో తీరు.. ఇదే విచిత్రం!

సెప్టెంబరు 17.. HYD చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. నిజాం పాలనుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందిన ప్రత్యేక సందర్భం. అయితే ఈ వేడుకను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో చేసుకుంది. అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవం, బీజేపీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట వేడుకలు జరిపాయి. వీరంతా కలిసి చేసింది ప్రజల విజయాన్నే!
News September 18, 2025
HYDలో ఉచిత బస్పాస్ ఇవ్వండి సీఎం సార్!

విద్యా వ్యవస్థను మార్చేద్దాం అని అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఈ రోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ముందుగా విద్యార్థులకు ఉచిత బస్పాస్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థినులకు ఎలాగూ మహాలక్ష్మి సౌకర్యం ఉంది. ఎటొచ్చీ బాయ్స్కే ఈ సమస్య. రూ.కోట్లు ‘మహాలక్ష్మి’కి కేటాయిస్తున్న ప్రభుత్వం.. HYDలో కిక్కరిసి ప్రయాణించే స్టూడెంట్కు బస్పాస్ ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నారు.