News August 12, 2025

నులి పురుగులను నిర్మూలిద్దాం: జిల్లా కలెక్టర్

image

నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో నీరస పడతారని వివరించారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపం వస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News August 13, 2025

SKLM: రాష్ట్రస్థాయి డిబేట్ పోటీల్లో సత్తాచాటిన గంగోత్రి

image

శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలకు చెందిన విద్యార్థినిని గంగోత్రికి రాష్ట్ర స్థాయి డిబేట్ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. ఆర్టీఐ చట్టంపై ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ బి.శామ్యూల్ చేతులు చేతులమీదుగా అవార్డు అందుకున్నారని స్థానిక ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు మంగళవారం తెలిపారు. కళాశాలలో విద్యార్థినిని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.

News August 13, 2025

SKLM: సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

image

పోలీస్ కుటుంబ సభ్యులకు సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా SP మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళం SP కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని, బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

News August 13, 2025

SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం కోర్ట్ ఆవరణలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రాజీలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు విషయంలో అధిక శ్రద్ధ వహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.