News February 4, 2025

నులి పురుగుల నివారణ మాత్రలను మింగించండి : కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.  1663 అంగన్వాడీ కేంద్రాలు, 1957 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలను మింగించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 4, 2025

‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

image

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.

News February 4, 2025

రెండు మండలాలతో అమీన్ పూర్ మండల పరిషత్

image

రాష్ట్రంలోని అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్ పూర్ నిలిచింది. రెండు గ్రామపంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్ పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.

News February 4, 2025

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO

image

దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.