News February 22, 2025
నూకాంబికా జాతరపై CMకు కొణతాల లేఖ

అనకాపల్లి శ్రీనూకాంబికా అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి జాతర విశిష్ఠత గురించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్కు వివరించినట్లు తెలిపారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రజల తరఫున వీరిద్దరినీ ఆహ్వానించినట్లు చెప్పారు.
Similar News
News November 9, 2025
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ముందే చెప్పామన్న ATC

ఢిల్లీ ఎయిర్పోర్టులో 2 రోజుల క్రితం తలెత్తిన తీవ్ర సాంకేతిక సమస్య గురించి తాము కొన్ని నెలల ముందే గుర్తించి చెప్పామని ATC పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని AAIకి లేఖ రాసినట్లు వెల్లడించింది. కానీ తమ సూచనలను పట్టించుకోలేదంది. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలి 800కు పైగా విమానాలపై ప్రభావం చూపింది.
News November 9, 2025
రేపు సాలూరు ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

సాలూరు ప్రభుత్వ ఐటీఐ వద్ద సోమవారం అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ఆచారి తెలిపారు. బొబ్బిలి, విజయనగరం, విశాఖలోని ప్రముఖ కంపెనీల్లో 100 వేకెన్సీలు ఉన్నాయన్నారు. అప్రెంటీస్ అయిన వారు ప్లేస్మెంట్ కోసం కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. స్టైఫండ్ రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఇస్తారని, అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఉదయం 10 గంటలకు హాజరుకాలన్నారు.
News November 9, 2025
APPLY NOW: NPCILలో 122 పోస్టులు

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 Dy మేనేజర్, Jr ట్రాన్స్లేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, PG, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్సైట్: https://npcilcareers.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


