News April 7, 2025
నూజివీడులో నేడు పరిష్కార వేదిక కార్యక్రమం

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం నూజివీడు నిర్వహించనున్నారు. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
అనంతపురం జిల్లాలో మొదలైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు

అనంతపురం జిల్లాలోని 64 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల వద్ద ఏర్పాటు చేసిన రోల్ నంబర్ల షీట్లను సరిచూసుకుని లోపలికి వెళ్లారు. అధికారులు నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News February 24, 2026
విజయవాడలో మహిళతో గొడవ.. యువకుడి సూసైడ్

కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మాచవరంలో సుమంత్ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళతో పరిచయం ఏర్పడగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇరువురికి ఇటీవల గొడవలు జరుగడంతో మనస్తాపం చెందిన సుమంత్ సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 24, 2026
NLG: కొత్త సొసైటీల ఏర్పాటుపై కసరత్తు

రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి (NLG-42, SRPT-44, YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త వాటిలో విలీనం చేయనున్నారు.


