News July 7, 2025
నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News July 7, 2025
తిరుపతి: ఎవరు లేని వారికి దేవుడే దిక్కు..!

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి బస్టాండు, రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వరకు పదులసంఖ్యలో కొందరు అక్కడే తిని అక్కడే పడుకుంటారు. వీరిలో కొందరు మద్యం మత్తులో గొడవలు పడి <<16976933>>హత్య<<>>లు, హత్యాయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో బిక్షగాళ్లు మాత్రమే ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం కొందరు సంచరిస్తూ రాత్రిపూట యాత్రికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు భక్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.
News July 7, 2025
వెల్లలచెరువులో వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టవారిపాలెం నుంచి వినుకొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 7, 2025
పెద్దపల్లి జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 9 వరకు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప అత్యవసర ప్రయాణాలు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.