News March 20, 2025
నూజివీడు: గేట్ 2025లో త్రిబుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు గేట్ 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచినట్లు ఆర్జీయూకేటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. గేట్లో వెయ్యిలోపు ర్యాంకులను 30 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన అమిరెడ్డి అశోక్ జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించాడని వివరించారు.
Similar News
News March 2, 2026
దాడికి ముందు ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ మెసేజ్

ఇరాన్పై USతో కలిసి మొదటి దాడి చేసే కొన్ని నిమిషాల ముందు అక్కడి పౌరులు, అధికారులకు ఇజ్రాయెల్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ప్రార్థన వేళలు తెలిపే ‘బడేసబాహ్’ యాప్ హ్యాక్ చేసి నోటిఫికేషన్లు పంపింది. ‘ప్రతీకారానికి సమయం వచ్చింది’, ‘అమాయక ఇరాన్ ప్రజలను పీడిస్తున్న వారు ఆయుధాలు వదలండి’ అంటూ ఆ సందేశాలు సాగాయి. దాడిపై ఇరాన్ ప్రజల మద్దతు కోసం, అధికారులను హెచ్చరించేందుకు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
News March 2, 2026
మైండ్లో మ్యాటర్.. హ్యాండ్లో పవర్ ఉండాలి: హరీశ్ రావు

పదవ తరగతి విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. “మీ మైండ్లో మ్యాటర్ ఉంటేనే సరిపోదు.. పరీక్షలో వేగంగా రాయడానికి హ్యాండ్లో పవర్ ఉండాలి” అని చమత్కరించారు. ఏకాగ్రతతో చదివి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టి, తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు.
News March 2, 2026
VZM: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


