News February 2, 2025

నెక్కొండ: పారా అథ్లెటిక్స్‌లో దేవాకు బంగారు పతకాలు

image

నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన నునావత్ దేవా రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 17 -20వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో జరగబోయే 23వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలకు దేవా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు శేఖర్ అభినందించారు.

Similar News

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.

News December 14, 2025

రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.

News December 14, 2025

HNK, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. నేడు పోలింగ్ అనంతరం వచ్చే ఫలితాలు గ్రామీణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.