News March 19, 2024

నెక్స్ట్ బీజేపీ లిస్టులో నా పేరు వస్తుంది: జలగం

image

ఖమ్మం: బీజేపీ అధిష్ఠానం విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్టులో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు అన్నారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు ఆగిందో పార్టీకే తెలియాలన్నారు. పాత బీజేపీ నేతలతో మాట్లాడే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ సీనియర్ నేతల సహకారం తనకే ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ సత్తా ఏంటో ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

image

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 19, 2026

చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

image

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

News February 19, 2026

ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

image

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.