News August 20, 2025

నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయండి: ఖమ్మం కలెక్టర్

image

వనమహోత్సవం కింద ఈ సంవత్సరం వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి వనమహోత్సవం, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యాలయాల రూఫ్‌లపై సోలార్ ప్యానెళ్ల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

Similar News

News August 20, 2025

సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి: సీపీ

image

సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న నగదు బాధితులకు రీఫండ్ చేసే వరకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని ఖమ్మం CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీసీ ద్వారా పోలీస్ అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో సైబర్ మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. బాధితులు 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

News August 20, 2025

ప్రణాళికాబద్ధంగా భూ సేకరణ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

image

నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో మొత్తం 3,778 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.

News August 20, 2025

వైరా రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వైరాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మత్స్య విత్తన అభివృద్ధి శాఖ కార్యాలయం, వైరా రిజర్వాయర్‌లను పరిశీలించారు. ఆయన రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపల పెంపకం, దిగుబడిపై మత్స్య శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ వర్షాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.