News December 12, 2025
నెల్లూరులో పొలిటికల్ హీట్ !

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News December 12, 2025
నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురును బైక్పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
News December 12, 2025
నెల్లూరు: నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ క్లోజ్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మతు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు.
News December 12, 2025
NLR: ఒకే చీరకు ఉరేసుకుని భార్యాభర్తల సూసైడ్

నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్(34), ప్రమీలమ్మ(28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకున్నారు. కుటుంబంలో ఏం జరిగింది? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


