News July 6, 2025

నెల్లూరులో రొట్టెల పండుగ.. తొలిరోజే జనం కిటకిట

image

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

image

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 5, 2025

రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

image

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.‌