News February 5, 2026
నెల్లూరు: ఆన్లైన్లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!

నెల్లూరు వెంకటరెడ్డి నగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్, టెలిగ్రామ్లో శివాని అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ ఉద్యోగి మహిళ సూచించిన బ్యాంక్ ఖాతాలకు రూ.29.8 లక్షలు నగదు జమచేశాడు. తన అవసరం నిమిత్తం పెట్టుబడులు ఉపసంహారించుకునేందుకు ప్రయత్నించగా నగదు రాలేదు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 5, 2026
హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కాకాణి

తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సీఎం చంద్రబాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులను కొట్టేయాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, ఆ రెండింటినీ కొట్టేయాలని ఆయన పిటిషన్ వేశారు.
News February 5, 2026
నెల్లూరు: ప్లాట్లు కొన్నారా.. జాగ్రత్త!

NMC పరిధిలో 540 అక్రమ లే అవుట్లలో 5500 ప్లాట్స్కు 3500 LRSకు రాగా 2 వేలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బుచ్చిలో 36 లే అవుట్లలో 30 అక్రమం కాగా, 6 మాత్రమే అనుమతి పొంది ఉన్నాయి. వీటిల్లో 800 ప్లాట్లకు నోటీసులు జారీ కాగా, 80 మాత్రమే LRS కు వచ్చాయి. గూడూరులో 70 వరకు అక్రమ లే అవుట్లు ఉండగా.. కావలిలో అక్రమ లే అవుట్లకు LRS లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు.
News February 5, 2026
నెల్లూరు: రైతులే స్వయంగా.. యాప్లో పంట నమోదు

APAIMS 2.0 యాప్ని ప్రభుత్వం తీసుకోచ్చింది. దీని ద్వారా రైతులే స్వయంగా తమ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ను మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయి MPINను లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రైతు తమ పొలం వద్దకు వెళ్లి ఫోటో దిగి నమోదు చేసుకోవచ్చని ఆశాఖ కోవూరు AD అనిత Way2Newsకి తెలిపారు. విడవలూరులో రైతుల ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆత్మ PD శారద, AO లక్ష్మి చేపట్టారు.


