News December 30, 2025
నెల్లూరు: ఆ ఘనత మనకే..!

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.
Similar News
News December 31, 2025
నెల్లూరులో 6899 నాణ్యత లేని ఇళ్లు .!

ఇళ్లు లేని వారికి గూటిని సమకూర్చడంలోనూ.. అధికారులు.. కాంట్రాక్టర్ల ధన దాహం నిజమనేది తేటతెల్లమవుతోంది. స్వయానా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు జిల్లా అధికారుల సమీక్షలో 6899 ఇళ్లు స్లాబులు, గోడలు, బేస్మెంట్లు నిర్మాణాలు నాణ్యత లోపించినట్లు తేల్చి చెప్పారు. వీటికి యుద్ధ ప్రాటిపాదికన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేసిన పిదపే.. బిల్లులు మంజురు చేస్తున్నట్లు హెచ్చరించారు.
News December 30, 2025
సందిగ్ధంలో గూడూరు సబ్ కలెక్టర్ పోస్టు..?

గూడూరు సబ్ కలెక్టర్ పోస్టుకు మోక్షం కలగడం లేదు. ఇక్కడ సబ్ కలెక్టర్గా పనిచేసిన రాఘవేంద్ర మీనన్ బదిలీ అయి 2 నెలలు గడుస్తోన్నప్పట్నుంచి ఇంచార్జిగా శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలో ఆలస్యం నెలకొంది. గూడూరు నెల్లూరులో కలిపిన తరువాత అయినా.. పోస్టును భర్తీ చేయాల్సి ఉంది.
News December 30, 2025
నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్లోకి విలీనం చేశారు.


