News March 4, 2025
నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్ఐవో తెలిపారు.
Similar News
News March 4, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. 15 ఏళ్లు జైలు శిక్ష
☞ నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు
☞ మనుబోలు: స్వీట్స్తో శ్రీ విశ్వనాథ స్వామికి ఏకాంత సేవ
☞ ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలి: MLA ప్రశాంతి
☞ నెల్లూరు: చంద్రబాబుపై రైతు ఆగ్రహం
☞ ఉదయగిరి: సేల్స్ టాక్స్ అధికారుల దాడులంటూ పుకార్లు
☞ సంగం: రూ.3.5 లక్షల విలువ చేసే ఉత్సవ విగ్రహాల అందజేత
News March 4, 2025
నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు

పోలీస్ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, నిజాయితీ గల విశ్రాంత అడిషనల్ ఎస్పీ భోగాది పృథ్వీ నారాయణ తుది శ్వాస వదిలారు. గతంలో నెల్లూరు నగర సీఐగా పనిచేశారని పోలీస్ సంఘం నాయకులు శ్రీహరి తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడని, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
News March 4, 2025
నెల్లూరు: రిజర్వాయర్లో మహిళ డెడ్ బాడీ

వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.