News November 22, 2024
నెల్లూరు: ఇంటర్ విద్యార్థులకు డిప్లొమా కోర్సులు

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్ (బైపీసీ) విద్యార్థులకు డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజ మన్నార్ తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ కోర్సులలో 95 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 తేదీలోపు రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
నెల్లూరులో యువతి దారుణ హత్య.. UPDATE

బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.
News September 14, 2025
MLA సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆయన పర్యటించారు. ట్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను దోపిడీ చేస్తూ సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News September 13, 2025
కాసేపట్లో కొత్త కలెక్టర్ బాధ్యతలు.. సమస్యలు ఇవే.!

నెల్లూరు కొత్త కలెక్టర్గా హిమాన్షు శుక్లా శనివారం సా.5.30 గం.కు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు పలు కీలక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. GGHలో అధ్వాన పరిస్థితులు, కరేడు భూముల వివాదం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఆస్పత్రుల సేవల మెరుగు, పెన్నా పొర్లుకట్టలు, చెరువుల పటిష్టత, ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.