News January 18, 2026
నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.
Similar News
News February 12, 2026
పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

పొదలకూరు నిమ్మ మార్కెట్లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.
News February 12, 2026
నెల్లూరులో పరీక్ష ఫీజులు ఇలా..!

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 2023-25, 2024-26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈనెల 17వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు డీఈవో బాలాజీరావు కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒకదానికి రూ.100 చెల్లించాలని సూచించారు.
News February 12, 2026
నెల్లూరు కలెక్టరా.. మజాకా!

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తనదైన మార్క్ చూపించారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనే సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.500 కోట్లతో ఏరో స్పేస్ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించింది. అక్కడ భూమి, ఇతర అనుమతులకు సంస్థ ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. వెంటనే నెల్లూరు కలెక్టర్ ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో దుత్తలూరు మండలంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు.


