News August 22, 2024
నెల్లూరు: ‘ఇసుక తోలకంలో వే బిల్ లేకుంటే చర్యలు’

ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్, జిల్లా SP సంయుక్తంగా ప్రెస్ మీట్ ద్వారా గురువారం ప్రజలకు సూచనలు చేశారు. ఇసుక కావలసిన వారు టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ నందు పేర్లు నమోదు చేసుకున్న రవాణా వాహనాల ద్వారా ఇసుకను అందిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నప్పటికీ 24 గంటలలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వే బిల్ లేకుంటే చర్యలు తీసుకుంటామని SP తెలిపారు.
Similar News
News July 7, 2025
నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News July 7, 2025
నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
News July 6, 2025
మంత్రి లోకేశ్కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.