News March 31, 2025

నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

image

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.

Similar News

News April 2, 2025

నెల్లూరు : PM కిసాన్ లింక్ పేరిట మోసం

image

PM కిసాన్ పేరిట వాట్సాప్‌కు వచ్చిన ఓ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైన ఘటన నెల్లూరులో జరిగింది. బాధితుని కథనం.. గోమతి నగర్‌కు చెందిన ప్రసాద్ రావుకు వాట్సాప్‌లో పీఎం కిసాన్ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేశాడు. తర్వాత గత నెల 29న ఫోన్‌పే ఓపెన్ చేసి చూడగా.. మూడు సార్లు రూ. 2,59,970 డ్రా చేసినట్లు చూపించింది. దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ రోశయ్య దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2025

నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8 తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.

News April 1, 2025

హైదరాబాద్‌లోనే మాజీ మంత్రి కాకాణి..?

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది. 

error: Content is protected !!