News September 11, 2025
నెల్లూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 5.58 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News September 11, 2025
నెల్లూరు: ప్రైవేట్ కళాశాలలో జరగని ప్రాక్టికల్ తరగతులు!

నెల్లూరు జిల్లాలో 185 Jr.కళాశాలలు ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 100 రోజులు గడిచినా ల్యాబ్ల బూజు దులిపే పనిలేదు. రసాయనాలు లేక, సదుపాయాలు లేని పరిస్థితి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కేవలం థియరీపై దృష్టి పెడుతున్నారు. పరీక్షలకు ముందు ల్యాబ్లు తెరిచి పూర్తి మార్కులు వేసి దగాకు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News September 11, 2025
వేగంగా దగదర్తి విమానాశ్రయం నిర్మాణ పనులు

దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.916 కోట్లతో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూ సేకరణ, OLS సర్వే పూర్తి చేయడం జిల్లా యంత్రాంగంపై ఉంది. AAI అధికారులు కొండలు తొలగింపు, కాలువ మార్పు, చెరువు పూడ్చివేత వంటి మార్పులు సూచించారు. మొత్తం 1379 ఎకరాల్లో 669 ఎకరాలు సేకరించారు. దామవరం మేత పోరంబోకు భూములు, కౌరు గుంట రైతులకు పరిహారం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి.
News September 11, 2025
విజయ డైరీ పాల సేకరణ ధరలు పెంపు

విజయ డైరీ పాల సేకరణ ధరలు పెంచనున్నట్లు పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కేజీ వెన్నకు రూ.775 లెక్కన లీటర్ పాలకు రూ. 77.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి కేజీ వెన్నకు రూ.785 లెక్కన లీటర్ పాలకు రూ. 78.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 కలుపుకొని రూ.80 ఇవ్వనున్నట్లు తెలిపారు.