News April 2, 2024
నెల్లూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ప్రభుత్వ టీచర్పై వేటు

వరికుంటపాడు మండలం రామదేవులపాడులో రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయసంకల్ప యాత్రలో వింజమూరు మండలం నందిగుంట ఉపాధ్యాయుడు జక్కం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై నోడల్ అధికారి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతయ్య తెలిపారు.
Similar News
News October 1, 2025
CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.
News October 1, 2025
SP అజితను కలిసిన MP వేమిరెడ్డి

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంగళవారం SP అజితను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా జిల్లాకు వచ్చిన అజితకు MP బొకే అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై వారు చర్చించారు.
News October 1, 2025
దసరా పండుగ.. దోచేదాం దర్జాగా.!

పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్లో టికెట్ల ధరలు రేసు గుర్రాల్లా పరుగులు తీస్తాయి. సాధారణ రోజుల్లో కన్నా అదనంగా ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తాయి యాజమాన్యాలు. దసరా నేపథ్యంలో AC బస్సులలో నెల్లూరు TO HYDకు రూ.1200, స్లీపర్ రూ.2150 వరకు పెంచేశారు. బెంగళూరుకు రూ.1,000, స్లీపర్ రూ.1600-2 వేల వరకు ధర ఉంది. అదే RTCలో NLR-HYDకు సూపర్ లగ్జరీ రూ.850, లగ్జరీ రూ.740, ఏసీ రూ.1330గా ఉంది.