News April 11, 2024

నెల్లూరు: ఎన్నికల పరిశీలకుల నియామకం 

image

జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమించింది. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు నితిన్ సింగ్ బదారియా , కందుకూరు, కావలి, ఉదయగిరికి రామ్ కుమార్ గౌతమ్, సర్వేపల్లికి కరీ గౌడ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. పోలీస్ పరిశీలకులుగా కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరికి అశోక్ టి దూదే , సర్వేపల్లికి అరవింద్ సాల్వే ను నియమించింది.

Similar News

News March 17, 2025

నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.

News March 17, 2025

పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

image

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News March 17, 2025

నెల్లూరు : 174 కేంద్రాలు…33,434 మంది విద్యార్ధులు

image

నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO బాలాజీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 174 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,434 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ‌విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందు రావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్ష బాగా రాయాలన్నారు.

error: Content is protected !!