News June 27, 2024

నెల్లూరు: ఐటీడీఏ పీవోపై జడ్పీ సీఈవో విచారణ

image

నెల్లూరు ఐటీడీఏ పీవో మందా రాణిపై జడ్పీ సీఈవో కన్నమనాయుడును విచారణ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి పీవోపై ఫిర్యాదు చేసిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్యను విచారించారు. పీవో అవినీతి నిధులు దుర్వినియోగంపై విచారించి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

Similar News

News September 20, 2024

నేటి నుంచి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.

News September 20, 2024

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారికి యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో జిల్లాలోని వృద్ధి కారకాలను (గ్రోత్ ఇంజన్లను) గుర్తించి విజన్ యాక్షన్ ప్లాన్-2047ను అక్టోబర్ 15 లోపు తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 19, 2024

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్‌ కమిటీ సభ్యులకు వివరించారు.