News August 5, 2024

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా

image

సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. గ్రామాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని తొలగిస్తున్నారని నియోజకవర్గాలలో 700 మందిని ఇప్పటికే తొలగించినట్లు పేర్కొన్నారు. తొలగించిన సిబ్బందిని వెంటనే తిరిగి చేర్చుకోవాలని లేకుంటే నియోజకవర్గాల వారీగా పార్టీ తరఫున ప్రతి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News February 21, 2026

కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.

News February 21, 2026

నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2026

రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువకుడి దుర్మరణం

image

తిరుపతి జిల్లా చంద్రగిరి ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నెల్లూరు పొదలకూరు రోడ్డు నేతాజీనగర్‌కు చెందిన రోషన్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.