News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Similar News
News February 22, 2026
కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.


