News February 22, 2025

నెల్లూరు: గ్రూప్-2 పరీక్షలకు 7 పరీక్ష కేంద్రాలు కేటాయింపు

image

ఈనెల 23న ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ -11 పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, చిరునామాను తెలుసుకునేందుకు 0861 2331261 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 22, 2025

పెంచలకోన నరసింహ స్వామికి విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. 

News February 22, 2025

నెల్లూరు: వెబ్ ‌సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు 

image

ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో వచ్చినట్లు జిల్లా ఇంటర్ ఆర్ఐవో ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. https@//bie.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి కానీ, విద్యార్థి ఆధార్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు అన్నారు.

News February 22, 2025

కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

image

బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.

error: Content is protected !!