News March 8, 2025
నెల్లూరు: ఘోరం.. బాధల్లో ఉన్నా దోచేశాడు

సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 12, 2026
50 పడకల హాస్టల్ భవనాల పురోగతి ఏంటి? : వేమిరెడ్డి

ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) పథకం కింద నెల్లూరు జిల్లాలో 50 పడకల హాస్టల్ భవనాన్ని మంజూరు చేసిందా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. హాస్టల్ నిర్మాణం కోసం మంజూరైన నిధులలో ఎంత ఖర్చు చేశారు?, పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? వంటి వివరాలు కోరారు. కేంద్రమంత్రి దుర్గా దాస్ ఉయికే నెల్లూరుతో పాటుమొత్తం 31 హాస్టల్స్కు రూ.75.3 కోట్లు మంజూరు చేశామన్నారు.
News February 12, 2026
నెల్లూరు: నకిలీ డాక్టర్ అరెస్ట్

వైద్యం పేరుతో నమ్మించి మహిళను మత్తులోకి దించి నగలు దోచుకున్న నకిలీ డాక్టర్ను అలిపిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన దేవళ్ల సాయి కృష్ణ (29) జయమ్మ అనే మహిళకు వైద్యం చేస్తానని రూ.1.45 లక్షలు వసూలు చేసి, ఆమె బంధువు మౌనికకు మత్తు మాత్రలు ఇచ్చి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరించాడు. నిందితుడు గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు అలిపిరి ఎస్ఐ శ్రీవాణి తెలిపారు.
News February 12, 2026
నెల్లూరు: 8 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో గుర్తించబడిన 8 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జలదంకి, బోగోలు, మర్రిపాడు, వింజమూరు, కలిగిరి, ఇందుకూరుపేట, ఆత్మకూరు గ్రామీణ, అనంతసాగరం తదితర 8 మండలాలకు గాను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 23న కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.


