News February 20, 2025
నెల్లూరు చేరుకున్న రెవెన్యూ శాఖ కార్యదర్శి

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 21, 2025
నెల్లూరుకు చేరుకున్న మంత్రి నాదెండ్ల

మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపటి క్రితం నెల్లూరకు చేరుకున్నారు. ఆయనకు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్తోపాటూ పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తువాత నెల్లూరుకు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఆయన 22న సంగం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
News February 21, 2025
పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ఆనం

రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News February 21, 2025
నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్: జగన్

ఇవాళ మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా నేను ప్రేమగా స్మరించుకుంటున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్’. అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.