News April 26, 2024
నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. వాలీబాల్లో గాలి తగ్గిందని 12 ఏళ్ల బాలుడు ఓ చోటకు వెళ్లాడు. అక్కడ అనికేపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి సైకిల్ పంపు ద్వారా బాలుడి మలరంధ్రాల్లో గాలి కొట్టాడు. దీంతో అతని పొట్ట ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజాపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News April 24, 2025
ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.
News April 23, 2025
ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.
News April 23, 2025
నెల్లూరు: రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో అనుమతి లేని రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ గౌడ్ కోరారు. నెల్లూరు కలెక్టరేట్లో డీఆర్వో ఉదయభాస్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారన్నారు. బోగస్ ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.