News July 5, 2024
నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం!

నెల్లూరు జిల్లాలో మొదటిసారి పెద్దపులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మర్రిపాడు మండలం వెలుగొండ అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం కనిపించినట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News February 1, 2026
నెల్లూరు: నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 20,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
News February 1, 2026
స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరించనున్నారని వీటి ఆపరేటర్ల ఎంపికకు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డీపీఓ వసుమతి తెలిపారు. అల్లూరు, అనంత సాగరం, ఏఎస్పేట, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి, వాకాడు, ఓజిలి, విడవలూరు, సీతారామపురం, కలువాయి, దగదర్తి, దుత్తలూరు పలు మండలాల్లో స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు.
News February 1, 2026
నేడే కేంద్ర బడ్జెట్.. నెల్లూరు జిల్లాకు నిధులు వచ్చేనా.?

పట్టణాల్లో మురుగు నీటి నెట్వర్క్, నీటి సరఫరా బలోపేతం కోసం కేంద్ర ‘అమృత్’ పథకం జిల్లాలో నిధుల లేమితో నత్తనడకన సాగుతోంది. నెల్లూరులో storm water drainageకు ₹82 కోట్లు అవసరం కాగా ₹19 కోట్లు కేటాయించారు. కావలిలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్లాంటకు రూ. 3 కోట్లు, వాటర్ సప్లై స్కీంకు ₹10 కోట్ల అవసరం. బుచ్చి వాటర్ స్కీంకు ₹71 కోట్లు అవసరం కాగా ₹25 కోట్లు కేటాయించారు. వీటికి కేంద్ర నిధులు కేటాయించేనా.?


