News September 4, 2025

నెల్లూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు అవార్డులు

image

టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం(M) పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CHచెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ.కాలేజ్ లెక్చరర్ డొమినిక్‌రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ పీడీ ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విజయవాడలో వీళ్లు అవార్డులు అందుకుంటారు.

Similar News

News September 5, 2025

ఆ బాధ్యత టీచర్లదే : కలెక్టర్

image

జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు. ప్రభుత్వ, ప్రవేట్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యారంగా అభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యావ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు శిక్షణ పొందాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

News September 5, 2025

నెల్లూరు: ధాన్యం రేటు పతనంపై నిరసన

image

నెల్లూరు జిల్లాలో వరి పుట్టి మద్దతు ధరను ప్రభుత్వం రూ.19,720గా ప్రకటించింది. దళారులు, మిల్లర్లు కలిసి రూ.16వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘ నాయకుడు గంగపట్నం రమణయ్య ఆరోపించారు. పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం, మిల్లర్లు, దళారుల దోపిడిపై ఈనెల 8న రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని ప్రకటించారు.

News September 5, 2025

NLR: హూజ్ యాప్‌తో రూ.2 కోట్లకు టోకరా..?

image

కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రజల ఆశను కొందరు ఆసరాగా చేసుకొని భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హూజ్ యాప్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. 2024లోనే ఈ యాప్ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేయించుకుంది. ఈ యాప్‌లో చేరిన వారికి గత నెల 20వ తేదీ నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు వాపోయారు.