News March 20, 2024

నెల్లూరు జిల్లాలో హత్య

image

కుమారుడే తండ్రిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో కుటుంబ కలహాలతో భార్య వెంకట రమణమ్మపై భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశాడు. ఈక్రమంలో భార్య కోమాలోకి వెళ్లింది. ఇది గమనించిన వాళ్ల పెద్ద కుమారుడు మహేశ్ గడ్డపారతో తండ్రిని పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు  నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News February 5, 2026

నెల్లూరు రొయ్యలకు గిరాకీ..!

image

నెల్లూరు జిల్లాలో 40వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. సోమశిల, కండలేరుతో పాటు 276 చెరువుల్లో కలిపి ఏటా 5లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది. 2021-22లో 4.67లక్షలు, 2022-23లో 3.44లక్షలు, 2023-24లో 3.29లక్షలు, 2024-25లో 3.63లక్షలు, 2025-26లో 3.39లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా.. 60శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఈయూ దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడంతో మన రొయ్యలకు అక్కడ డిమాండ్ పెరగనుంది.

News February 5, 2026

మహాశివరాత్రి ఆఫర్ పేరిట మోసాలు

image

మహాశివరాత్రి ఆఫర్ ఇప్పుడు లైవ్‌లో ఉందని, మొదట నమ్మకం లేకపోయినా కాస్ట్ రివార్డు లభించిందని పేర్కొంటూ స్కామర్లు వాట్సాప్ గ్రూపుల్లో లింకులు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు ఇలాంటి ఆఫర్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News February 5, 2026

నెల్లూరు: భైరవరంలో 3 నెలల పసికందు మృతి

image

దుత్తలూరు (M) భైరవరం SC కాలనీలో 3 నెలల పసికందు మృతి చెందారు. విషయం తెలుసుకున్న PHC వైద్యులు ఆయూబ్ అప్సర్ సిబ్బందితో కలిసి వారి నివాసానికి వెళ్లి పరిశీలించారు. బుధవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలో ఆ పసికందుకు వ్యాక్సిన్ వేశారని, రాత్రి 10 గంటల తర్వాత మృతి చెందినట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేయడం వల్ల మృతి చెందలేదని అన్నారు. కాగా వ్యాక్సిన్ వల్లే పసికందు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.