News October 2, 2025

నెల్లూరు: తగ్గనున్న విద్యుత్ చార్జీలు

image

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.

Similar News

News October 2, 2025

నెల్లూరు: అనుమతులు లేకుండానే ఆక్వా సాగు!

image

ప్రభుత్వ భూముల్లో అనుమతి పత్రాలు లేకుండా 12,734 మంది రైతులు 16,836.84 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రెవెన్యూ నుంచి NOC లేకుండా ఈతంతు సాగుతోంది. రీసర్వే జరగని కారణంగా 8678.56 ఎకరాలకు చెందిన 4174 మంది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి LPM నంబర్లు తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఈనెల 20వ తేదీలోగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు పొందాలని ఫిషరీస్ JD శాంతి తెలిపారు. దీంతో విద్యుత్ రాయితీలు పొందవచ్చన్నారు.

News October 2, 2025

నెల్లూరు: రొయ్య రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు!

image

అమెరికా టారిఫ్స్ తో జిల్లాలో కుదేలైన అక్వా రంగంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రొయ్య సాగు రైతుల్లో ఏర్పడిన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రొయ్యల ఎగుమతుల ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10% ఉన్న రష్యా ఆర్డర్ 40% పెరిగిందని సమాచారం. తాజాగా యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం కూడా రైతులలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఎగుమతిదారులు చెబుతున్నారు.

News October 2, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మిథున్‌ రెడ్డి

image

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా పీవీ మిథున్‌ రెడ్డి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే మిథున్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకే అప్పగిస్తూ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.