News April 25, 2024
నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య

నెల్లూరు భక్తవత్సలనగర్కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 12, 2025
జిల్లా యువజన వారోత్సవాలకు ఆహ్వానం: సెట్నల్

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 23వ తేదీన DKW కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి యువజన వారోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్నల్ సీఈవో నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారికి ఫోక్ డ్యాన్స్, గ్రూప్ ఫోక్ సాంగ్, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, పొయెట్రీ రైటింగ్ పలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు.
News October 12, 2025
నిబంధనలు అతిక్రమించి బాణసంచా తయారీ చేస్తే చర్యలు : SP

నెల్లూరు జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని నెల్లూరు జిల్లా SP అజిత తెలిపారు. టపాసుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టపాసులు అక్రమ నిల్వలు ఉన్నాయనే కారణాలతో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, విడవలూరు పరిధిలో-1 కేసు, కందుకూరు టౌన్ స్టేషన్ పరిధిలో-1 కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.
News October 12, 2025
కలువాయి: వృద్ధ దంపతుల ఆత్మహత్య

కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన వృద్ధ దంపతులు వింజం కొండయ్య, వింజం రత్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో విష గుళికలు తిని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది