News September 8, 2025
నెల్లూరు : నవ వధువు ఆత్మహత్య

వివాహమై ఏడాది తిరగకుండానే యువతి చనిపోయిన ఘటన ఇది. మృతురాలి తండ్రి వివరాల మేరకు.. నెల్లూరులోని గాంధీసంఘం గిరిజన కాలనీకి చెందిన ప్రశాంతి(25)కి చిట్వేల్(M) నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేశ్తో 9 నెలల కిందట పెళ్లి జరిగింది. రాజేశ్ తన స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. ఇటీవల వీరి మధ్య కలహాలు వచ్చాయి. దీంతో ప్రశాంతి ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె తండ్రి దాసరి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 8, 2025
నెల్లూరు: దరఖాస్తులకు ఈనెల 15 చివరి తేదీ

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ చివరి గడువని జిల్లా సైన్స్ అధికారి N. శివారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల తరుఫున వారి వినూత్న ఆలోచనలను ప్రాజెక్ట్ రూపంలో ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు.
News September 7, 2025
కావలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. తలమంచి- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య మూడో లైన్లో వెళుతున్న రైలు నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నోవల్ టోపనో జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచామన్నారు.
News September 7, 2025
ఉదయగిరిలో గాజుల కుటుంబానికి అరుదైన గౌరవం

ఉదయగిరిలోని గాజుల వీధికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి కుటుంబంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. ప్రతి సంవత్సరం ఈ కుటుంబంలో ఎవరికో ఒకరికి స్టేట్, జిల్లా, మండల అవార్డు వస్తుంది. గత సంవత్సరం స్టేట్ అవార్డు గాజుల షారుక్, గాజుల మున్న అందుకోగా, ఈ సంవత్సరం షాహిదా అక్తర్ జిల్లా అవార్డు, రంతుజాని మండల అవార్డు అందుకున్నారు.