News February 3, 2025
నెల్లూరు: నేడే ఎన్నిక.. క్షణం క్షణం ఉత్కంఠ
నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ పదవి కోసం టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. గెలుపు కోసం అటు మంత్రి పొంగూరు నారాయణ, ఇటు కాకాణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి మారినట్లు సమాచారం. కాగా నెల్లూరులో మొత్తం 54 కార్పొరేటర్లు ఉండగా ఒకరు రాజీనామా చేయడంతో 53 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News February 3, 2025
VSUలో కొత్త కోర్సు ఏర్పాటు
విక్రమ సింహపురి యూనివర్సిటీలో కొత్తగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సు ఏర్పాటు చేసినట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జే.విజేత తెలిపారు. VSU, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా ఈ కోర్సు తీసుకురావడం జరిగిందన్నారు. 10వ తరగతి పాసై, 18-25 సం.ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 3, 2025
ప్రజా పాలన కాదు.. పిచ్చి నారాయణ పాలన: కాకాణి
వైసీపీ మద్దతుదారుల ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. వైసీసీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చారని, ఆయన అక్కడే ఏళ్లుగా ఉన్నారన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. ‘ఇది పిచ్చి నారాయణ పాలన అని ప్రజలే తమ గోడును వెల్లబోసుకుంటారని కాకాణి ఎద్దేవా చేశారు.
News February 3, 2025
నెల్లూరు జిల్లాలో ఏఎంసీ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్ ఖరారు?
నెల్లూరు జిల్లాలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. నెల్లూరుకు సంబంధించి ఓసి జనరల్, కోవూరు ఎస్సీ జనరల్, కందుకూరుకు ఎస్సీ మహిళ, కావలికి బీసీ మహిళ, ఆత్మకూరు బీసీ మైనారిటీ మహిళ, ఉదయగిరి ఓసీ మహిళ, సర్వేపల్లి ఓసీ మహిళకు కేటాయించారు. దాదాపుగా అధికారికంగా కూడా ఇవే ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.