News September 12, 2025

నెల్లూరు: పంచాయతీ భవానాలకు మోక్షం..

image

జిల్లాలో అద్దె, శిదీలావస్థకు చేరుకున్న పంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు మోక్షం లభించింది. దీంతో జిల్లాలో తోలుత 40 చోట్ల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరవగా, ఒక్కోదానికి రూ. 32లక్షలు వెచ్చించనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద నిధులు కేటాయించనున్నారు.

Similar News

News September 12, 2025

నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

image

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.

News September 12, 2025

మిస్టరీగా కావలి మాజీ MLA జాడ?

image

మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.

News September 12, 2025

నెల్లూరు: మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపం!

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపిస్తుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. వరికుంటపాడు పాఠశాలలో తెల్లన్నం, ఆలుగడ్డ కూర పెట్టారు. కందుకూరులో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బోగోలు పాఠశాలలో కూర్చునే సౌకర్యం లేదు. గుడ్లూరులో మెనూ ప్రకారం వడ్డించినా విద్యార్థులు తినలేదు. అధికారులు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.