News February 14, 2025

నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News February 17, 2026

నెల్లూరు: వారిని.. అడిగినా పిలవడం లేదంట..!

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు స్థానికతకే ప్రాధాన్యం ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశ రాజకీయాలనే శాసిస్తున్న BJPకి ఇక్కడ గౌరవం ఇవ్వడం లేదంట. తమను ఆహ్వానించాలని మంత్రుల పీఏలను BJP నేతలు కోరుతున్నా ఖాతరు చేయడం లేదంట. వక్ఫ్ బోర్డు స్థలంలో చేపడుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపనకు, 47వ డివిజన్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన కార్యక్రమాలకు పిలవలేదంట, కూటమిలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు వాపోతున్నారు.

News February 17, 2026

నెల్లూరు మేయర్‌గా మరోసారి మహిళకే ఛాన్స్!

image

నెల్లూరు మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్‌కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

News February 17, 2026

కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

image

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.