News July 3, 2024
నెల్లూరు: బస్సులో రూ.80 లక్షల చోరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719967725358-normal-WIFI.webp)
బస్సులోనే మత్తు పెట్టి భారీగా నగదు చోరీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విజయవాడ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ.80 లక్షలతో బెంగళూరుకు బయల్దేరారు. కావలి సమీపంలోని మద్దూరుపాడు దాబా వద్ద భోజనానికి ఆపారు. ఇందులో ఒకరు దాబాలో తిని మరొకరికి పార్శిల్ తీసుకు రావడానికి వెళ్లారు. బస్సులో ఉన్న దొంగలు అతడికి మత్తు పెట్టి అతని వద్ద ఉన్న రూ.80 లక్షల డబ్బు సంచి తీసుకుని రోడ్డు దాటుకుని మరొక వాహనంలో పరారయ్యారు.
Similar News
News July 5, 2024
గూడూరు మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720151764301-normal-WIFI.webp)
గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News July 5, 2024
జగన్ పర్యటనతో వైసీపీ ఊపందుకుంది: కాకాణి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162428062-normal-WIFI.webp)
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
News July 5, 2024
దేవదాయ శాఖ మంత్రితో పొంగూరు నారాయణ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720157770947-normal-WIFI.webp)
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.