News April 6, 2025

నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

image

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Similar News

News April 11, 2025

నెల్లూరు: బ్యాంక్ ఉద్యోగం పేరిట మోసం

image

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన శ్రీదేవి గతంలో ఓ గోల్డ్‌లోన్ సంస్థలో పనిచేశారు. కలువాయి(M) చవటపల్లికి చెందిన రమ్య లోన్‌కు వెళ్లి శ్రీదేవిని పరిచయం చేసుకుంది. డబ్బులు కట్టడంతో తనకు HYDలో SBI బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని రమ్య నమ్మించడంతో శ్రీదేవి ఉద్యోగానికి రూ.9లక్షలు ఇచ్చింది. ఉద్యోగాలు తీసిచ్చే అతను చనిపోయాడంటూ రమ్య తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 11, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!